telugudanam.co.in

      telugudanam.co.in

   

సేమ్యాతోపకోడి

[ వెనుకకు ]

కావలసిన వస్తువులు:

శనగపిండి - 1/2 కిలో.
సేమ్యా - 1/4 కిలో.
ఉల్లిపాయ ముక్కలు - 2 కప్పులు.
పచ్చిమిర్చిముక్కలు - 2 చెంచాలు.
ఉప్పు, కారం - తగినంత.
>నూనె - అవసరమైనంత.
 

తయారు చేసే విధానం:

ముందుగా సేమ్యాని నీటిలో ఉడికించి వార్చి ఒక గుడ్డ మీద ఆరబెట్టాలి. సేమ్యాలు బాగా ఆరిన తరువాత ఒక బేసిన్‌లోకి తీసుకొని దానికి శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, మిర్చిముక్కలు, ఉప్పు, కారం, తగినంత నీరు చేర్చి పకోడీ పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె వేసి మరిగాక పై మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని మరిగే నూనెలో వేసి బాగా వేగాక తీసి పళ్లెంలో వేసుకోవాలి. వేడి వేడిగా తింటే ఈ పకోడి ఎంతో రుచి ఉంటుంది.


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: